TS Inter Results 2020: ఇంటర్ ఫలితాలపై రేపు స్పష్టత.. అంతా సిద్ధం

ఎప్పుడొస్తాయన్న దానిపై రేపు స్పష్టత రానుంది. వాస్తవానికి ఇవాళే కీలక ప్రకటన వస్తుందనుకున్నప్పటికీ.. కొన్ని కారణాల వలన వాయిదా పడింది. రేపు ఇంటర్ బోర్డు అధికారులు విద్యాశాఖ మంత్రిని కలిసి రిపోర్టు సమర్పిస్తారు. అనంతరం ఫలితాలను ఎప్పుడు విడుదల చేస్తారన్న దానిపై ప్రకటన వచ్చే అవకాశముంది. వాస్తవానికి ఇంటర్ ఫలితాలకు సంబంధించిన ప్రక్రియ మొత్తం పూర్తయింది. ఫలితాలు సరిగ్గా వచ్చాయా? లేదంటే ఏమైనా లోపాలు ఉన్నాయా? అన్న దానిపై ఒకటికి రెండుసార్లు పరీశీలిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఈసారి ఫలితాలను నేరుగా ఆన్‌లైన్‌లోనే విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేస్తారని సమచారం.
రేపు ఇంటర్ బోర్డు నివేదిక సమర్పించిన తర్వాత.. బుధవారం ఫలితాలను విడుదల చేయవచ్చని తెలుస్తోంది.